*డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న “నా తెలుగోడు”*

by Sunil Reddy · November 17, 2025

*డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న “నా తెలుగోడు”*

 

హరినాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వ నిర్మాణంలో డ్రీం టీం ప్రొడక్షన్స్ పై హరినాథ్ పోలిచర్ల హీరోగా తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ తదితరులలో ప్రేక్షకుల ముందుకు రానున్న “నా తెలుగోడు”. మళ్లీ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శివ సంగీతాన్ని అందించగా రమణ ఎడిటింగ్ చేశారు. చంద్ర బోస్, గడ్డం వీరు ఈ చిత్రంలోని పాటలు రచించారు. డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న “నా తెలుగోడు” సినిమాకు సంబంధించిన విషయాలు హరినాథ్ పోలిచర్ల మీడియాతో పంచుకోవడం జరిగింది.

 

* నా తెలుగోడు అనే సినిమా షూటింగ్, సెన్సార్ పూర్తిచేసుకుని డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాము. సమాజానికి ఉపయోగపడే ఒక విషయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసాము.

 

* ఒక సైనికుడు దేశం కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. వారి జీవితం పై, ఆడపిల్లలను కాపాడటంపై, డ్రగ్స్ నుండి సమాజాన్ని కాపాడే కొన్ని అంశాలను ఈ సినిమాలో చూపించాలి అనే ప్రయత్నం చేశాము.

 

* నందమూరి తారక రామారావు గారి వల్ల తెలుగు వారికి మంచి గుర్తింపు వచ్చింది. ఆయన నాకు ఇన్స్పిరేషన్. అన్నగారి సినిమాలు అంటే చాలా ఇష్టం. నా తెలుగోడు అనే టైటిల్ పెట్టడం గర్వంగా ఉంది. సినిమాల ద్వారా మనం చెప్పాలి అనుకునేది ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు అని సినిమా చేశాము.

 

* సినిమాలో యుద్ధ నేపద్యంలో కొన్ని సీన్స్ ఉంటాయి. గోవా, మునార్, హైదరాబాద్ ఇంకా కొన్ని ప్రాంతాలలో ఈ సినిమాను చిత్రీకరించడం జరిగింది. సినిమాకు కట్స్ లేకుండా A సర్టిఫికెట్ రావడం మాకు సంతోషకరం.

 

* సినిమాలో నా పాత్ర సైనికుడుగా ఉండబోతుంది. చిన్న పిల్లల్ని డ్రగ్స్ రవాణా కోసం ఉపయోగించుకుంటున్నారు. అది అసాంఘిక కార్యక్రమం. వాటిని అరికట్టే ఉద్దేశంతో ఈ సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయి.

 

* నాకు చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఉండేది. డాక్టర్ అయినప్పటికీ బ్యాలెన్స్ చేసుకుంటూ నా నటనా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. మొదట్లో డాక్టర్ గా ఎక్కువగా సమయం ఇచ్చేవాడిని కాని ఇప్పుడు నట జీవితానికి కూడా సమయాన్ని ఇవ్వగలుగుతున్నాను.

 

* అమెరికాలో అన్నగారి గురించి ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు అక్కడే ఉన్న బాలకృష్ణ గారు నన్ను మెచ్చుకున్నారు.

 

* ఈ సినిమాను హిందీలో ఆర్ కె పేరిట కూడా విడుదల చేయనున్నాము. తెలుగు రాష్ట్రాలలో 60 థియేటర్లలో విడుదల చేయనున్నాము. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నత స్థాయికి చేరడం ఎంతో గర్వంగా ఉంది.

 

* ఈ సినిమాలో 5 పాటలు ఉంటాయి. సినిమాలలోని నా పాత్రలు ప్రతి సినిమాకు మరొక సినిమా నుండి బిన్నంగా ఉంటాయి.

 

* తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ తదితరులు నటించడం సినిమాకు బలంగా మారింది. మళ్లీ సినిమాకు చాలా అందమైన విజువల్స్ అందించారు.

 

* ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాము. సినిమాలో మా అమ్మ పాత్రను నిజంగా మా అమ్మ పాత్ర నుండి కొంత ఇన్స్పైర్ అయ్యి చేశాము.

 

* నా నటనా జీవితంలో ఎంతో మంది ఎన్నోసార్లు ప్రశంసించారు. కొన్ని అవార్డులు వచ్చాయి. అవి నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. తెలుగు తనాన్ని అమెరికాలో కూడా చూపించడం నాకు గొప్ప విషయంగా అనిపిస్తుంది.

 

* నా నిర్మాణ సంస్థ ద్వారా కొత్త వారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నన్ను నా సినిమాను అందరూ ప్రోత్సహించాలి అని కోరుకుంటున్నాను.

You may also like